News27th Nov 11:33 AMSunil Byrisetty1 min read

అమరావతిలో వెల్లివిరియనున్న తిరుమల నాథుని దివ్య తేజస్సు

తిరుమల నాథుని దివ్య తేజస్సు రాజధాని అమరావతిలో వెల్లివిరియనుంది. వెంకటపాలెంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన

అమరావతిలో వెల్లివిరియనున్న తిరుమల నాథుని దివ్య తేజస్సు
తిరుమల నాథుని దివ్య తేజస్సు రాజధాని అమరావతిలో వెల్లివిరియనుంది. వెంకటపాలెంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ₹260 కోట్లతో రెండు దశల్లో మహా నిర్మాణ యజ్ఞం మహా సంకల్పంతో, భక్తుల సౌలభ్యం కోసం రూ.260 కోట్లతో ఈ బృహత్తర అభివృద్ధి కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. మొదటి దశ పనులు (రూ. 140 కోట్లు) * ప్రాకార నిర్మాణం: రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ దివ్యమైన ప్రాకారం. * మహా రాజగోపురం: ఏడంతస్తుల సువిశాల రాజగోపురం, స్వామివారి కీర్తిని దశ దిశలా చాటేలా నిర్మాణం. * మండపాల శ్రేణి: ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం వంటి భక్తిభావానికి అద్దం పట్టే మండపాలు. * ఆంజనేయస్వామి ఆలయం: శ్రీవారి సేవలో భాగంగా ప్రియ భక్తుడైన ఆంజనేయస్వామివారికి ప్రత్యేక ఆలయం. * పుష్కరిణి & ఫ్లోరింగ్: పవిత్ర పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్‌తో ఆలయ ప్రాంగణం నిర్మాణం. రెండో దశ పనులు (రూ. 120 కోట్లు) * శ్రీవారి మాడ వీధులు: తిరుమల తరహాలో భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా మాడ వీధులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం. * అన్నదాన కాంప్లెక్స్: నిత్య అన్నదానానికి అనువుగా సువిశాలమైన భవనం. * యాత్రికుల వసతి: విశ్రాంతి భవనం, అర్చక-సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్. * ఇతర సౌకర్యాలు: పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్.
Andhra Pradesh
Amaravati
Lord Venkateswara
Venkata Palem Temple
Temple Expansion
Chandrababu Naidu
Foundation Stone
Rajagopuram
Pushkarini
అన్నదాన కాంప్లెక్స్
యాత్రికుల వసతి
ఆలయ నిర్మాణం
మౌలిక సదుపాయాలు
Scroll for the next article