News16th Sep 09:24 AMSunil Byrisetty1 min read
రైతులకు ముందే దీపావళి!
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రైతులకు ముందే దీపావళి రానుంది. దీపావళి పండుగకు ముందే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత డబ్బుల
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రైతులకు ముందే దీపావళి రానుంది. దీపావళి పండుగకు ముందే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి.
రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత డబ్బులు దీపావళి పండుగకు ముందే ఖాతాల్లో వేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000, మూడు వాయిదాల్లో, ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. 20వ వాయిదా ఆగస్టు 2న విడుదల అయింది. 21వ విడత సాధారణంగా నవంబర్–డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. కానీ రైతులకు ముందుగానే డబ్బులు కేంద్రం జమ చేయాలని భావిస్తోంది.