News28th Mar 02:57 PMSunil Byrisetty1 min read
మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలలో భారీ భూకపం
మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలలో భారీ భూకపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో బారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచార
మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలలో భారీ భూకపం సంభవించింది.
రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత 7.7గా నమోదైంది.
ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో బారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం.
దీని తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలాయి.
ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు.
మరికొందరు ప్రాణాలు రక్షించేందుకు ఈత కొలనులలో దూకారు..
ఇక బ్యాంకాంక్లో ఈ భూకంప తీవ్రత 7.3గా నమోదైంది.
ఈ నగరంలో అనేక భవనాలు నేలమట్టమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది..
సహాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.. వందలాది మంది క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్కు తరలిస్తున్నారు..
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు ఈ భూకంప ప్రభావం భారతదేశంలోనూ కనిపించింది.
గౌహతి, కోల్కాతా, మిజోరం, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి.