News9th Jun 10:53 AMSunil Byrisetty1 min read
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాలలో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సార్లు సుమారు నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయాందోళనతో ఇండ్లలోనుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు
ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాలలో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సార్లు సుమారు నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయాందోళనతో ఇండ్లలోనుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అర్దరాత్రి 12:47 గంటల సమయంలో భూమి కంపించినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా వరుస భూకంపాలు చోటుచేసుకోవడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కూడా జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.