Politics7th Sep 10:28 AMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు
2026 జనవరిలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ సి
2026 జనవరిలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలని, నవంబర్ 15లోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేసి, ఈవీఎంలు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది.