News1st Dec 04:52 PMSunil Byrisetty1 min read

కేరళ సీఎంకి ఈడీ నోటీసులు?

కేరళ సీఎం పినరయి విజయన్ కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక

కేరళ సీఎంకి ఈడీ నోటీసులు?
కేరళ సీఎం పినరయి విజయన్ కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, కూడా ఈ నోటీసు లు అందాయి. జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిబంధనలను ఉల్లంఘిం చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్‌బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎమ్ అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు. ఈడీ గత మూడేళ్లుగా ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిం చి.. సెప్టెంబర్‌లో తన నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు సమర్పించింది. మసాలా బాండ్ల ద్వారా సేకరించిన నిధులను.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూమి కొను గోలుకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కేరళ మౌలిక సదుపాయాల నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) 2019 ఏప్రిల్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయడం ద్వారా మసాలా బాండ్ల రూపంలో రూ. 2,150 కోట్లు నిధులను సేకరించింది. ఈ బాండ్ల జారీపై ఈడీ 2021లో దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈడీ నోటీసు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా ధృవీకరించారు.
Kerala Politics
India News
Kerala CM
ED Notice
Money Laundering Case
Pinarayi Vijayan
Thomas Isaac
KIIFB
Masala Bonds
RBI Regulations
Enforcement Directorate
Scroll for the next article