News12th Nov 04:02 PMSunil Byrisetty1 min read

$30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విద్యాసంస్కరణలు

భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది, దేశాన్ని $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకో

$30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విద్యాసంస్కరణలు
భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది, దేశాన్ని $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ సదరన్ రీజియన్ – విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునః రూపకల్పన చేయడం” అనే థీమ్ తో కాంక్లేవ్ ఏర్పాటుచేశారు, ఈ అంశంపై నేను ఏకీభవించడం లేదు, భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుంది, $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మానవవనరులు, మేధోసంపద లేకుండా ఆర్థికవృద్ధి సాధ్యం కాదు. ఈ మహోన్నత లక్ష్యఛేదనకు ఉన్నతవిద్యా రంగం వ్యూహాత్మక మూలస్థంభం. గత 17నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ఏపీకి $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. త్వరలో జరగబోయే పెట్టుబడుల సదస్సులో మరో$120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. 2029 నాటికి ట్రిలియన్ డాలర్ పెట్టుబడులు మా లక్ష్యం, రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలోపేతమవుతుంద’ని వివరించారు.
Andhra Pradesh
Investment
Digital India
India Economy
Educational Reforms
Narendra Modi
Nara Lokesh
Higher Education
Amaravati
CII Conclave
Economic Growth
Scroll for the next article