News5th Oct 11:44 AMSunil Byrisetty1 min read

సీడ్ యాక్సెస్ రోడ్డు పై ఎలివేటెడ్ కారిడార్

అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకట

సీడ్ యాక్సెస్ రోడ్డు పై ఎలివేటెడ్ కారిడార్
అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకూ నిర్మించిన ఈ రహదారిని అక్కడ నుంచి మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు. 45వ ప్యాకేజీలో భాగంగా రెండోదశలో సీతానగరం నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకూ సుమారు రూ.613.30 కోట్లతో దీనిలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్లు, అండర్పాస్లు నిర్మించనున్నారు. 2024 చివర్లో ప్రభుత్వం ఈ అంచనాలు రూపొందించింది. ఎపిసిఆర్డిఎ అదనపు కమిషనర్ ఛైర్మన్ గా, ఎడిసిఎల్ చీఫ్ ఇంజినీరు మెంబర్ కన్వీనర్ గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్అండ్ బి, పబ్లిక్ హెల్త్, ఎపిసిఆర్డిఎ ఈ ఎన్సీ లు, గుంటూరు ఆర్టిఒ సభ్యులుగా ఉంటారు. రెండోదశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులకు గతంలో నిర్ణయించిన ధరలు సరిపోవని వాటిని సవరించాలని నిర్ణయించి వెంటనే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును సీతానగరం నుండి ఎన్టీఆర్ కట్ట వరకూ ఆధునిక పద్ధతుల్లో వైర్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ రూపంలోనూ, మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అండర్పస్ నిర్మించి జాతీయ రహదారిలో ఇంటర్ఛేంజ్ పద్ధతిలో నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు.
Amaravati
Seed Access Road
Elevated Corridor
ADC
APCRDA
Infrastructure Development
National Highway
Road Expansion
Bridge Construction
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు
పట్టణాభివృద్ధి
ప్రభుత్వ ప్రణాళిక
Scroll for the next article