News9th Dec 11:41 AMSunil Byrisetty1 min read

ఏపీలో ఎలక్ట్రానిక్ మొబిలిటీ విప్లవం.. రూ.5 వేలకే ఈ-సైకిల్

కాలుష్యరహిత రవాణా దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” పథకాల పరిధిలో రూ.23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం రూ.5 వేలకే ప్రజలకు అందించేందుకు

ఏపీలో ఎలక్ట్రానిక్ మొబిలిటీ విప్లవం.. రూ.5 వేలకే ఈ-సైకిల్
కాలుష్యరహిత రవాణా దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” పథకాల పరిధిలో రూ.23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం రూ.5 వేలకే ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పడనుంది. అక్కడ మొదటి విడతగా ఈ-సైకిళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులకు ఈ విధానం ప్రత్యక్ష లాభం చేకూర్చేలా కార్యాచరణ రూపొందించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు డిజైన్‌లు, అవసరాలకు అనుగుణంగా మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంధన వ్యయం తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యాలుగా పేర్కొంది.
AP Government
E Mobility
Electric Cycle
Green Transport
Andhra Pradesh
Clean Energy
Swachh Andhra
Chandrababu Naidu
Youth Benefits
Student Welfare
కాలుష్యరహిత రవాణా
ఎలక్ట్రిక్ సైకిల్ పథకం
ఎకో ఫ్రెండ్లీ
సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్ట్
Scroll for the next article