News18th Jul 03:03 PMSunil Byrisetty1 min read
మందపల్లి దేవస్థానంలో కమిషనర్ పర్యటన
దేవదాయ ధర్మదాయ కమిషనర్ శ్రీ కె.రామచంద్రమోహన్ మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. గోదావరి పుష్కరాలు–2027 దృష్ట్యా సి.జి.ఎఫ్. నిధులతో నిర్మిస్తున్న రూ
దేవదాయ ధర్మదాయ కమిషనర్ శ్రీ కె.రామచంద్రమోహన్ మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. గోదావరి పుష్కరాలు–2027 దృష్ట్యా సి.జి.ఎఫ్. నిధులతో నిర్మిస్తున్న రూ.3 కోట్ల తైలాభిషేక మండపం, రూ.1.20 కోట్ల అన్నప్రసాద భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులకు స్వయంగా వడ్డించి వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. మీడియా ప్రతినిధులతో సమావేశమై దేవస్థాన అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.