Education26th Jun 09:35 AMSunil Byrisetty1 min read
ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక డ్రైవ్
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే ధ్యేయంగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఏపీలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని సమగ్రశిక్
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే ధ్యేయంగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.
ఏపీలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలన్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే చేపట్టాలని, జూలై 12వరకు డ్రైవ్ కొనసాగాలని ఆదేశించారు. 6-14 ఏళ్ల పిల్లలను కచ్చితంగా బడుల్లో చేర్చడం ఈ డ్రైవ్ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.