National7th Oct 03:05 PMSunil Byrisetty1 min read
తగ్గనున్న ఈవీ వాహనాల ధరలు
ప్రస్తుతం పెట్రోల్ కార్లు, వాహనాల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మారనున్నాయి. ఢిల్లీలో జరిగిన 20వ
ప్రస్తుతం పెట్రోల్ కార్లు, వాహనాల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మారనున్నాయి. ఢిల్లీలో జరిగిన 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా మారతాయని తెలిపారు. ఐదేళ్లలోపు భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. ఈవీల ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని చెప్పారు.