Politics8th Aug 04:29 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ మంచిని ప్రజలకు చెప్పాలి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్ల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కార్యకర్తల్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్ల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పార్టీ భావజలాన్ని అర్థం చేసుకోవాలి.. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. వైయస్సార్సీపీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమని పేర్కొన్నారు.