News15th Sep 11:10 AMSunil Byrisetty1 min read
విజయవాడ బస్టాండ్లో పేలుడు పదార్థాలు
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఒక్కసారిగా కలకలం రేగింది. భారీగా పేలుడు పదార్థాలను కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లను గుర్తించారు. వీటి
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఒక్కసారిగా కలకలం రేగింది. భారీగా పేలుడు పదార్థాలను కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లను గుర్తించారు. వీటి బరువు సుమారు ఐదు కిలోలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఓ ప్రయాణికుడు బ్యాగ్ తీసుకొచ్చి వదిలేసి వెళ్లినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకుని, ఘటనపై కృష్ణ లంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.