News13th Jan 11:19 AMSunil Byrisetty1 min read
హైవేపై కొనసాగుతున్న పండుగ రద్దీ
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏపీకి తరలి వెళ్తున్న వాహనాలతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా దగ్గర ట్రాఫిక్ స్
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏపీకి తరలి వెళ్తున్న వాహనాలతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. టోల్ప్లాజా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీకి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనం క్యూ కట్టడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్లో స్థాయిలో ప్రజలు తరలివెళ్లారు. నాలుగు రోజులుగా ఏపీకి భారీగా వాహనాలు తరలివెళ్తున్నాయి.