News16th Apr 03:46 PMSunil Byrisetty1 min read
ఫైబర్ నెట్ ఖాళీ.. 500 మంది ఉద్యోగులపై వేటు
ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారం
ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది.
సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు.
ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి ఉంది.
దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది.
దీంతో గత ప్రభుత్వ హయాంలో నియమించిన ఉద్యోగులు దాదాపుగా ఖాళీ అయినట్లేనని తెలుస్తోంది