News2nd May 12:01 PMSunil Byrisetty1 min read
చరిత్ర సృష్టించిన ఏపీ నౌక.. పంబన్ బ్రిడ్జ్ దాటి!
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో చారిత్రక పంబన్ బ్రిడ్జిని దాటి తొలి నౌకగా ఏపీ నౌక ఘనత సాధించింది. ఆ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను తొల
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో చారిత్రక పంబన్ బ్రిడ్జిని దాటి తొలి నౌకగా ఏపీ నౌక ఘనత సాధించింది.
ఆ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ వంతెనను తొలిసారిగా ఏపీకి చెందిన సరకుల నౌక దాటింది.
వైజాగ్ నుంచి ఏప్రిల్ 16న బయల్దేరిన '4 స్టార్' అనే సరకుల నౌక పంబన్ రైల్వే వంతెన దాటి కర్ణాటక కార్వార్ హార్బర్కు వెళ్లాల్సింది.
కాగా, నౌక బయల్దేరిన రోజు నుంచి బంగాళాఖాతంలో బలమైన ఈదురుగాలుల కారణంగా ఏప్రిల్ 23 చేరుకోవాల్సిన 4 స్టార్ మే1వ తేదీన చేరుకుంది.
దీంతో అరుదైన ఘనత ఏపీ నౌకకు సొంతమైంది.