News29th Aug 03:56 PMSunil Byrisetty1 min read

గత ఐదేళ్లు మత మార్పిడులే: సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వంలో ఐదేళ్లు దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరకు నియోజకవర్గం గన్నెలలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గత ప్రభ

గత ఐదేళ్లు మత మార్పిడులే: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో ఐదేళ్లు దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరకు నియోజకవర్గం గన్నెలలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలవంతపు మతమార్పిడులు చేశారని, అది చాలా తప్పు అని అన్నారు. మతం అంటే విశ్వాసమని, బలవంతంగా మత మార్పిడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమమని పేర్కొన్నారు. వైసీపీలోని మాజీ మంత్రి కోడలు స్వయంగా బయటకు వచ్చి మాట్లాడిందని, తనను బలవంతంగా మతం మారాలని అడిగితే మారనని గట్టిగా చెప్పానని పేర్కొందని అన్నారు. వాళ్ల ఇంట్లో పూజ కూడా చేసుకోలేని పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట వీరంతా హిందువులుగా చలామణీ అవుతూ, మతాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి మంచిది కాదన్నారు. విశ్వాసం ఉంటే ఉండొచ్చని, ఆ విశ్వాసాన్ని బలవంతంగా రుద్దడం సరికాదని పేర్కొన్నారు. అందుకే గత ప్రభుత్వంలో ఐదేళ్లు దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. పవిత్రతను దెబ్బతీయడంతోపాటు మత మార్పిడులు చేశారన్నారు. ఆ పార్టీలో ఉండాలంటే మతం మార్చుకోవాలనే క్రైటీరియా పెట్టారని, దానివల్ల కొంత మంది మారారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Government
Religion
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Religious Conversions
Forced Conversions
Temple Attacks
Hindu Temples
YSRCP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మతం
మత స్వేచ్ఛ
అరకు
సంజీవని కార్యక్రమం
రాజకీయ వార్తలు
ఏపీ వార్తలు
చంద్రబాబు వార్తలు
Scroll for the next article