News27th Jul 04:27 PMSunil Byrisetty1 min read
తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి
తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి టీటీడీ చైర్మన్ బీ
తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో
భోజనం చేశారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదం చాలా రుచిగా, శుచిగా, చక్కగా ఉందని ప్రశంసించారు. భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి భోజనం చేయడం భగవత్ ప్రసాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్టర్ లో తన అభిప్రాయాన్ని వెంకయ్య నాయుడు రాశారు.