Politics10th Jan 03:55 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు!

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీ కాలం జూన్ నెలతో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తు

ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీ కాలం జూన్ నెలతో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం, ఈ నాలుగు స్థానాలు క్లీన్ స్వీప్‌గా అధికార తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ, వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతోంది. ఈ నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకోవాలని సీనియర్లు దేవినేని ఉమ, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, మహాసేన రాజేశ్, ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేతలకు లేదా అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి అవకాశం దక్కవచ్చు. ఈ నాలుగు సీట్లూ కూటమికి దక్కడం ద్వారా, కేంద్రంలో ఎన్డీయే బలం మరింత పెరగనుంది.
Andhra Pradesh
Rajya Sabha
TDP
JanaSena
BJP
YSRCP
NDA
Rajya Sabha Elections
Devineni Uma
Galla Jayadev
మహాసేన రాజేశ్
రాజకీయ కూటములు
2026 ఎన్నికలు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article