News25th Jun 12:21 PMSunil Byrisetty1 min read
సెక్రటేరియట్లో ఉచిత కంటి పరీక్షలు
ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐజి B.V.రామిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స
ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐజి B.V.రామిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కమాండెంట్ ఎం.శంకర్రావు ఆధ్వర్యంలో డా. అగర్వాల్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో APSPF సెక్రటేరియట్ అధికారులు, మరియు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సిబ్బందిని ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ ఈ కంటి పరీక్షల వలన సిబ్బంది కంటి సమస్యలను ముందుగానే తెలుసుకొని తగిన వైద్యం చేయించుకొనుటకు వీలుగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 217 మందికి సిబ్బందితో పాటు ఇన్స్పెక్టర్లు ఎం. వెంకటేశ్వకర్లు, ఎస్. రమణ పాల్గొన్నారు.