News17th Aug 01:51 PMSunil Byrisetty1 min read
ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవెల!
కూటమి ప్రభుత్వం ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించింది. అయితే ఆ ప్రభావం ఆటోలపై పడింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆటో స్టాండ్లు వెలవెలబోయాయి. స్త్రీ శక్త
కూటమి ప్రభుత్వం ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించింది. అయితే ఆ ప్రభావం ఆటోలపై పడింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆటో స్టాండ్లు వెలవెలబోయాయి. స్త్రీ శక్తి పథకం ఆటోల యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది. ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పే వారికి కనీసం అద్దె చెల్లించడానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్లో తమ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.