Politics13th Jul 03:58 PMSunil Byrisetty1 min read
జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ..!
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం, 'ఊరు-వాడ' పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు ప్రారంభం కా
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం, 'ఊరు-వాడ' పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి తాజ్ హోటల్లో ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తమిళనాడు విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పేదలు, వెనుకబడిన వర్గాల కోసమే 'ఊరు-వాడ' పేరుతో సేవా కార్యక్రమాలు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు చెబుతున్నాయి. 'ఊరు-వాడ' కార్యక్రమానికి, తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదని పేర్కొంటున్నాయి.