News26th Apr 11:31 AMSunil Byrisetty1 min read
కంచి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరం వాసి!
తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన గణేశ్ శర్మ ఎంపికయ్యారు. అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు గణేశ్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ప్రస్తుత ప
తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన గణేశ్ శర్మ ఎంపికయ్యారు.
అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు గణేశ్ శర్మకు అరుదైన గౌరవం లభించింది.
ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు.
విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్షను ప్రసాదిస్తారని విశ్వనాధశాస్త్రి పేర్కొన్నారు.
అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు.
2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేశ్ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు.
యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి గణేశ్ శర్మ కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు.
గణేశ్ శర్మకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.