Education7th Dec 09:26 AMSunil Byrisetty1 min read
ఎంబీబీఎస్ లో 60.72% సీట్లు అమ్మాయిలవే!
ఎంబీబీఎస్ లో 60.72% అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66% అమ్మాయిల ప్
ఎంబీబీఎస్ లో 60.72% అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66% అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇటీవల ముగిశాయి. వీటి వివరాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి మంత్రి సత్యకుమార్ కు నివేదించారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది చొప్పున అమ్మాయిలు ఎంబీబీఎస్ లో చేరినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాఠశాల విద్య నుంచే అమ్మాయిలు నీట్ (NEET) లో ఉత్తమ ర్యాంకు సాదించేందుకు పుస్తకాలతో మమేకమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగానే మెజార్టీ సీట్లు దక్కించుకుంటున్నారని పేర్కొన్నారు.