International4th Aug 10:07 AMSunil Byrisetty1 min read
ప్రపంచమంతా సనాతనం.. భారత్లో క్రైస్తవం?
ప్రపంచ మతాలన్నిటిలో పురాతనమైన హిందూ మతానికి తిరిగి ఆదరణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంట
ప్రపంచ మతాలన్నిటిలో పురాతనమైన హిందూ మతానికి తిరిగి ఆదరణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి కోసం దీనిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా యోగా, ధ్యానం, వేదాలు, భగవద్గీత బోధనలు వారిని చాలా ప్రభావితం చేస్తున్నాయి. రష్యాలో వేలాది మంది ఇస్కాన్లో చేరి భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. అమెరికాలో కూడా, చాలా మంది ప్రముఖులు సనాతన జీవనశైలిని అవలంబించడం కనిపించడం ప్రారంభించారు. అయితే.. భారత్లో మాత్రం క్రైస్తవ జనాభా పెరుతోందట! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ జనాభాలో క్షీణత ఉన్నప్పటికీ.. భారతదేశంలో మాత్రం క్రైస్తవ జనాభా వేగంగా పెరుగుతోంది. గత దశాబ్దంలో క్రైస్తవ జనాభా 23.40 లక్షలు పెరిగింది.