Spiritual22nd Aug 04:23 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై గోవా సీఎం పూజలు
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె. సీనా నాయక్ అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ మరియు ఈఓ కలిసి ముఖ్యమంత్రికి శేషవస్త్రం, అమ్మవారి పవిత్ర చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను బహూకరించారు.