Business Type4th Nov 12:34 PMSunil Byrisetty1 min read
మళ్లీ పెరిగిన వెండి, బంగారం
బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుండగా.. మరొక రోజు స్వల్పంగా తగ్గుతుంది. రోజుకో విధంగా ధరలు ఊగిసలాడుత
బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుండగా.. మరొక రోజు స్వల్పంగా తగ్గుతుంది. రోజుకో విధంగా ధరలు ఊగిసలాడుతున్నాయి. తాజాగా తులం గోల్డ్ పై రూ.170 పెరగగా.. కిలో సిల్వర్పై మాత్రం రూ.2,000 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.170 పెరిగి.. రూ.1,23,170 దగ్గర అమ్ముడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 150 పెరిగి.. రూ.1,12,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.130 పెరిగి.. రూ.92, 380 దగ్గర అమ్ముడవుతోంది. ఇక వెండి ధర మాత్రం రూ.2,000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,54,000గా అమ్ముడవుతోంది. హైదరాబాద్లో కిలో వెండి రూ.1,68,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,54,000గా ట్రేడ్ అవుతోంది.