Business Type22nd Oct 11:34 AMSunil Byrisetty1 min read
దిగొస్తున్న పసిడి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దీపావళి తర్వాత ఔన్స్ బంగారం ధర 220 డాలర్లు తగ్గింది. దీంతో 4,122 డాలర్లకు గోల్డ్ రేట్ దిగొచ్చింది. మన కరెన్సీలో తులం బం
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దీపావళి తర్వాత ఔన్స్ బంగారం ధర 220 డాలర్లు తగ్గింది. దీంతో 4,122 డాలర్లకు గోల్డ్ రేట్ దిగొచ్చింది. మన కరెన్సీలో తులం బంగారం రూ. 7 వేలు పతనం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఔన్స్ వెండి ధర 3.9 డాలర్లు క్షీణించింది. 48.39 డాలర్ల వద్ద వెండి ధర ట్రేడైంది. బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనం కావడం 2013 తర్వాత ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.