News13th Aug 10:17 AMSunil Byrisetty1 min read
డ్వాక్రా సభ్యులా.. ఈ ఆఫర్ మీకే!
పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. సొంతంగా ఉపాధి పొందేందుకు రాయితీపై ఈ-ఆటోలను అందిస్తోంది. ఈ-ఆటో ధర దాదాపు
పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. సొంతంగా ఉపాధి పొందేందుకు రాయితీపై ఈ-ఆటోలను అందిస్తోంది. ఈ-ఆటో ధర దాదాపు రూ. 4.5 లక్షలు కాగా, ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రాయితీ ఇస్తోంది. మిగిలిన మొత్తానికి తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-ఆటోలను ప్రోత్సహిస్తున్నారు. ఆసక్తి గల డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబసభ్యులు మెప్మా అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.