News27th Dec 03:23 PMSunil Byrisetty1 min read

మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!

మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ గారు ఎకోపార్కు వాకర్స్ కు మరోసారి శుభవార్త అందించారు. మంగళగిరి ఎకోపార్కులో ఉదయం 6 నుంచి 9గంటల వరకు వాకింగ్ కు విచ్చేసేవారికి ఉచిత ప్రవేశం కల్

మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!
మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ గారు ఎకోపార్కు వాకర్స్ కు మరోసారి శుభవార్త అందించారు. మంగళగిరి ఎకోపార్కులో ఉదయం 6 నుంచి 9గంటల వరకు వాకింగ్ కు విచ్చేసేవారికి ఉచిత ప్రవేశం కల్పించేందుకుగాను 2026 సంవత్సరానికి లోకేష్ తన సొంత నిధులు చెల్లించారు. మంగళగిరి ఎకోపార్కు నిర్వహణ నిమిత్తం అటవీశాఖవారు ఎకోపార్కు సందర్శకులకు ప్రవేశ రుసుం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాకర్స్ ప్రతినిధులు వాకింగ్ నిమిత్తం ఏకోపార్కులో ఉదయం 6 గంటలనుంచి 9 గంటల వరకు ఉచిత ప్రవేశం కల్పించాలని గతంలో మంత్రి నారా లోకేష్ ను కోరారు. నిబంధనల ప్రకారం ఉచిత ప్రవేశం కల్పించడం వీలుకాకపోవడంతో లోకేష్ తన సొంత నిధులు సుమారు 5 లక్షలకు పైగా డిపార్ట్ మెంట్ కు చెల్లించారు.
Andhra Pradesh
Mangalagiri
Mangalagiri Eco Park
Nara Lokesh
Minister Lokesh
Good News for Walkers
Free Entry
Morning Walk
అటవీశాఖ
వాకర్స్ అసోసియేషన్
పుప్పాల కోటేశ్వరరావు
ప్రజాసేవ
Scroll for the next article