News14th Oct 01:20 PMSunil Byrisetty1 min read

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగు

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీలో సమావేశం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వివీ వైష్ణవ్, మంత్రి లోకేష్ హాజరయ్యారు. గూగుల్ సంస

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీలో సమావేశం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వివీ వైష్ణవ్, మంత్రి లోకేష్ హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా వివిధ ప్రతినిధులు హజరయ్యారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్ధతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.87520 కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఏఐ డేటా సెంటర్ సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది.
Andhra Pradesh
Cloud Computing
Google
Data Center
Visakhapatnam
AI
Tech Investment
Digital India
Innovation
Thomas Kurian
AI Infrastructure
Economic Development
Subsea Cable
Education
Healthcare
Agriculture
Industry
Scroll for the next article