Spiritual30th Dec 01:19 PMSunil Byrisetty1 min read
పలు దేవస్థానాల ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం
మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ద
మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను 12 మందిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకొక సభ్యుడు జనరల్ కేటగిరి నుంచి నియామకానికి అవకాశం ఉందని.. తర్వాత నియమిస్తామన్నారు.
ప.గో.జిల్లా, భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను 13 మందిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 సం.లు పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.