News22nd Jul 03:28 PMSunil Byrisetty1 min read

పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం

ఏపీలో ప్రజాభిప్రాయం మేరకు పేర్లు మార్చే అంశంపై పరిశీలన కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం అధ్యయనం చేసేందుకు మం

పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం
ఏపీలో ప్రజాభిప్రాయం మేరకు పేర్లు మార్చే అంశంపై పరిశీలన కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులుగా ఏడుగురు మంత్రులను నియమించింది. వీరిలో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. దీనికి కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది.
Andhra Pradesh news
Cabinet Sub-Committee
District and Mandal Renaming
Anagani Satyaprasad
Ponguru Narayana
Vangalapudi Anitha
పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం
Scroll for the next article