News1st May 06:11 PMSunil Byrisetty1 min read
సింహాచలం ఘటనపై కమిటీ విచారణ
సింహాచలంలో గోడ కూలి 8 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇంజినీర్లు, కాంట్రాక్టర్ లక్ష్మణరావు విచారిస్తున్నారు. అధికారుల ఒత్తిడితో తాత్
సింహాచలంలో గోడ కూలి 8 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది.
ఇంజినీర్లు, కాంట్రాక్టర్ లక్ష్మణరావు విచారిస్తున్నారు.
అధికారుల ఒత్తిడితో తాత్కాలిక గోడ నిర్మించామని కాంట్రాక్టర్ లక్ష్మణరావు వెల్లడించారు.
కాంక్రీట్ వాల్ నిర్మించాల్సి ఉన్నా.. అప్పటికప్పుడు గోడ కట్టాలని అధికారులు చెప్పారని తెలిపారు.
దేవదాయ, పర్యాటకశాఖ అధికారులు ఒత్తిడి తెచ్చారన్నారు.
తక్కువ సమయంలో గోడ నిర్మించలేమని చెప్పినా.. అధికారులు వినలేదని వివరించారు.
4 రోజుల్లోనే గోడ నిర్మాణం జరిగిందని లక్ష్మణరావు స్పష్టం చేశారు.