News1st Apr 02:56 PMSunil Byrisetty1 min read
'అగ్రిగోల్డ్' ఆస్తుల వేలానికి సిద్ధం
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఒక కొలిక్కి వస్తోంది. అగ్రిగోల్డ్ కుంభకోణంలో లక్షలాది మంది బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఒక కొలిక్కి వస్తోంది.
అగ్రిగోల్డ్ కుంభకోణంలో లక్షలాది మంది బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుంది.
10 లక్షల మంది బాధితులకు ఆ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అగ్రిగోల్డ్కు 21,642 ఎకరాల భూములు, లక్ష చ.గజాల స్థలాలున్నాయి.
వీటివిలువ 2012లో రూ. 3,869కోట్లు కాగా ఇప్పుడు మరింత పెరిగింది.
ఈ ఆస్తులన్నీ సీఐడీ ఆధీనంలోనే ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోనే కాక కర్ణాటక పొరుగు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ భూములున్నాయి.
కోర్టు అనుమతితో వీటిని వేలం వేసి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.