Politics27th Sep 03:14 PMSunil Byrisetty1 min read
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగ సంతకాలపైనే శ్రద్ధ
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ అని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావ
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ అని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదన్నారు. జీతాల కోసం మాత్రం దొంగచాటుగా సంతకాలు పెట్టిపోతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఇక దొంగచాటుగా సంతకాలు పెట్టి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత సాఫ్ట్ వేర్ ద్వారా ఎంతసేపు సభలో ఉన్నారో తెలిసిపోతుందని చెప్పారు. సభకు రాకుండా దొంగ సంతకాలు చేసినవారి జాబితా మా వద్ద ఉందని మాధవి స్పష్టం చేశారు.