News22nd Jan 04:49 PMSunil Byrisetty1 min read

ఘనంగా గిడుగు రామ్మూర్తి వర్ధంతి

తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ పితామహులు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి 86వ వర్ధంతిని నేడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ల

ఘనంగా గిడుగు రామ్మూర్తి వర్ధంతి
తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ పితామహులు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి 86వ వర్ధంతిని నేడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. త్రివిక్రమరావు (విక్రమ్ పూల), ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ (శరత్ చంద్ర)తదితరులు పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్ర పటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికార భాషా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు కీర్తి శేషులు గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. ఆయన కృషి కారణం గానే.. ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు, తెలుగు వ్యావహారిక భాషలోకి వచ్చాక అందరికీ చేరువ కాగలిగిందని అన్నారు. ఆర్. డి. విల్సన్ మాట్లాడుతూ.. గిడుగు సేవలు మర్చిపోలేనివి అని, ఆయన సాహితీ సేవలు అజరామరం అని కొనియాడారు.
Andhra Pradesh
Gidugu Ramamurthy
Telugu Language Movement
Andhra Pradesh
Official Language Society
Telugu Academy
Literary Services
భాషా సంరక్షణ
స్మారక సభ
సాంస్కృతిక కార్యక్రమం
స్మరణార్థం
Scroll for the next article