Spiritual6th Nov 01:23 PMSunil Byrisetty1 min read

వైభవంగా సింహాచల శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన

సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తుల

వైభవంగా సింహాచల శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన
సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అత్యంత వైభవంగా జరిపారు. సింహాచల పుణ్య క్షేత్రంలో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలో వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణ పుష్పార్చన , సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.
Andhra Pradesh
Simhachalam Temple
Visakhapatnam
Sri Varaha Lakshmi Narasimha Swamy
Golden Flower Offering
Swarna Pushparchana
ఆర్జిత సేవలు
వేదపండితులు
భక్తులు
హిందూ ఆచారాలు
Scroll for the next article