Spiritual23rd Jan 11:47 AMSunil Byrisetty1 min read
విజయవాడ దుర్గ గుడిలో వైభవంగా శ్రీ పంచమి వేడుకలు
శ్రీ పంచమి పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ ఆలయాన్ని దాదాపు 25,000 మంది విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులు ఈ శుభప్రదమైన రోజున అమ్మవారి ఆశీస్సుల కోసం తెల్
శ్రీ పంచమి పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ ఆలయాన్ని దాదాపు 25,000 మంది విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులు ఈ శుభప్రదమైన రోజున అమ్మవారి ఆశీస్సుల కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే రావడం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈ.ఓ. వి.కె. సీనా నాయక్, , ప్రధాన అర్చకులు లింగం బొట్ల దుర్గా ప్రసాద్, ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్లతో కలిసి అమ్మవారికి పెన్నులు, పుష్పాలను సమర్పించారు. 6వ అంతస్తులో ఉన్న మహామండపానికి చేసిన సుందరమైన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వేలాది మంది విద్యార్థులకు పెన్నులు, ప్రసాదం పంపిణీ చేశారు.