National3rd Sep 11:35 AMSunil Byrisetty1 min read
తగ్గనున్న నిత్యావసరాల ధరలు!
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిత్యావసరాల ధరలు తగ్గించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిత్యావసరాల ధరలు తగ్గించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జీఎస్టీ శ్లాబ్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్లను రద్దు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైద్య ఔషధాలు, దేశీయ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.