Telangana12th Aug 12:19 PMSunil Byrisetty1 min read
చందానగర్లో కాల్పుల కలకలం
హైదరాబాద్ చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. దుకాణంలో దుండగులపై ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపార
హైదరాబాద్ చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. దుకాణంలో దుండగులపై ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. దొంగలు జహీరాబాద్ వైపు పారిపోవడంతో పోలీసులు జిల్లాల సరిహద్దులను అలర్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు.