News17th Jul 09:28 AMSunil Byrisetty1 min read
ఢిల్లీ నుంచి నంద్యాలకు సీఎం చంద్రబాబు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా నంద్యాల జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ఉమ్మడి కర్నూలు వెళ్లనున్న
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా నంద్యాల జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ఉమ్మడి కర్నూలు వెళ్లనున్న సీఎం చంద్రబాబు, హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మల్యాల వద్ద రెండు మోటార్లు ఆన్ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు రైతుల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.