News19th May 01:33 PMSunil Byrisetty1 min read
సుజనా చౌదరిని గవర్నర్ దత్తాత్రేయ పరామర్శ
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ(సుజనా చౌదరి) ను సోమవారం కలిసి పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో గాయపడిన సుజనా
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ(సుజనా చౌదరి) ను సోమవారం కలిసి పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేయడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు.
యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు.