News4th Nov 12:13 PMSunil Byrisetty1 min read
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈశాన్య రుతు పవనాలు బలహీనపడటంతో ఎండ, వానలతో కూడిన మిశ్రమ వాతావరణం ఏర్పడింది. మొంథా తుఫాన్ తర్వాత తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం
తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈశాన్య రుతు పవనాలు బలహీనపడటంతో ఎండ, వానలతో కూడిన మిశ్రమ వాతావరణం ఏర్పడింది. మొంథా తుఫాన్ తర్వాత తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం కొనసాగి ఎండ తీవ్రత పెరిగింది. శీతాకాలంలో సైతం ఉక్కపోత పెరిగింది. సాధారణం కంటే మూడు డిగ్రీలు కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మయన్మార్ తీరం దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడనుంగా దాని ప్రభావం ఏపీ వైపు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈనెల 10వ తేదీ తర్వాత ఈశాన్య రుతు పవనాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి తమిళనాడును అనుకుని ఉన్న దక్షిణ కోస్తా. రాయలసీసులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోసారి వర్షం హెచ్చరికలతో రైతుల్లో కలవరం మొదలైంది.