News22nd Oct 02:39 PMSunil Byrisetty1 min read
రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్
కేరళ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధి
కేరళ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరువనంతపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం పథనంథిట్టకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమాద ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ దిగుతుండగా.. హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దించారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు బయల్దేరారు. హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాన్ని తోస్తున్న చిత్రాలు పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబ సమీపంలోని నీలక్కల్ వద్ద దిగాల్సింది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ స్థలాన్ని ప్రమాద ప్రాంతానికి మార్చారు.