News13th Sep 12:04 PMSunil Byrisetty1 min read
బుడమేరు ఆక్రమణలపై నిఘా
రెండేళ్ల క్రితం బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని వణికించిన విషయం తెలిసిందే. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న బుడమేరు వాగు స్థలం ఎడాపెడా ఆక్రమణకు గురి కావడం వల్ల వరద నీరు పోయే మార్గం కుచ
రెండేళ్ల క్రితం బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని వణికించిన విషయం తెలిసిందే.
విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న బుడమేరు వాగు స్థలం ఎడాపెడా ఆక్రమణకు గురి కావడం వల్ల వరద నీరు పోయే మార్గం కుచించుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆక్రమణలపై హైకోర్టు రంగంలోకి దిగింది. బుడమేరు ఆక్రమణలకు
గురి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించింది. ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.