Sports28th Sep 11:31 AMSunil Byrisetty1 min read
పాక్తో హైవోల్టేజీ ఫైనల్.. హ్యాట్రిక్ కొడతారా?
ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులను ఊరిస్తోంది. ఫైనల్స్లో తలపడేది భారత్- పాక్ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదే టోర్నీలో ఇప్పటికే పాక్ను రెండుసార్లు చిత్తుచిత్తుగా ఓడించిన భా
ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులను ఊరిస్తోంది. ఫైనల్స్లో తలపడేది భారత్- పాక్ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదే టోర్నీలో ఇప్పటికే పాక్ను రెండుసార్లు చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. 41 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్-పాక్ జట్లు తొలిసారి ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో ఆదివారం జరిగే ఈ హైవోల్టేజి సమరంపై ఆసక్తి రెట్టింపయ్యింది. టోర్నీలో భారత్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఓటమనేదే లేకుండా తుది పోరుకు అర్హత సాధించగా, అటు పాక్ ఓడిన రెండు మ్యాచ్లు భారత్పైనే కావడం గమనార్హం. దీంతో ఈ ఆదివారం క్రికెట్ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.