Politics5th Sep 02:55 PMSunil Byrisetty1 min read
వైసీపీకి హోం మంత్రి వార్నింగ్
వైసీపీ నేతలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాల
వైసీపీ నేతలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కల్పిత కథనాలను, అబద్ధాలను ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్య్రంగా పరిగణించలేమన్నారు. తాము ఎప్పుడూ న్యాయమైన రాజకీయ చర్చను స్వాగతిస్తామని అసత్య ప్రచారాలను మానుకోవాలని అనిత హెచ్చరించారు.