Politics7th Sep 03:57 PMSunil Byrisetty1 min read

సీఎం అభ్యర్థి నేను కాదు.. విజయసాయి

తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండటం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా అ

సీఎం అభ్యర్థి నేను కాదు.. విజయసాయి
తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండటం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా అని ప్రశ్నించారు. రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పరిపాలించాలా అనడిగారు. రాష్ట్రంలో రెడ్లు, కమ్మ వాళ్ళు మాత్రమే కాదు.. చాలా కులాలు, బీసీల్లో 140 కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు మొత్తం 6 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారని చెప్పారు. ప్రధానమైన కులాల్లో రెడ్డి, కమ్మ కాకుండా, కాపులు ఉన్నారు, వెలమలు ఉన్నారు. కాపులు, వెలమలు, బీసీవర్గాలు, రజకులు, ఎస్సీలు సీఎం కాలేదే అని ప్రశ్నించారు. వాళ్ళను అణగదొక్కుతూ, ఈ రెండు వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయని, పదవులను ఆక్రమించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Politics
Vijayasai Reddy
New Political Party
Chief Minister Candidate
AP Politics
Political Families
కాపు సామాజిక వర్గం
వెలమలు
బీసీ వర్గాలు
ఎస్సీ ఎస్టీలు
రాజకీయ ప్రాతినిధ్యం
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article